ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. శాంసంగ్ గెలాక్సీ M42 5G స్మార్ట్ఫోన్ను బుధవారం భారత్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తోంది. 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా వెనుకవైపు ఉంది. గెలాక్సీ ఫోన్ అమెజాన్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లలో లభించనుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ ఇందులో ఉన్నాయి.
6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ఫోన్ ధర రూ.21,999గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా నిర్ణయించారు. అమెజాన్ డాట్ఇన్, శాంసంగ్ డాట్కామ్తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా మే 1 నుంచి ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. M42 5G ఫోన్ ప్రిజం డాట్ బ్లాక్, ప్రిజం డాట్ గ్రే రంగులలో లభిస్తుంది.
డిస్ప్లే: 6.60 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా: 20 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48+8+5+5 మెగా పిక్సెల్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ:5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11