ఆలేరు టౌన్, మే 30: కొవిడ్ సంక్షోభ సమయం లో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆలేరు చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు భోజనం వడ్డించారు. అనంత రం మాట్లాడుతూ కొవిడ్ వైరస్ గొలుసును తెం చేందుకు ఈ నెల 12 నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ విధించిందన్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడంతోపాటు ప్రజలకు వైరస్పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పా టించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ లావణ్యలత, సీఐ నర్సయ్య, ఎస్ఐ రమేశ్ పాల్గొన్నారు.
మోత్కూరు, గుండాల మండలాల్లో కొనసాగుతున్న లాక్డౌన్
మోత్కూరు, మే 30: మోత్కూరు, గుండాల మం డలాల్లో ఆదివారం లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఆయా మండలాల పరిధిలోని పలు గ్రా మాలు , మున్సిపాలిటీ కేంద్రంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. భువనగిరి, నల్లగొం డ, తిరుమలగిరి రూట్ల నుంచి రాకపోకలు సాగించిన వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. గుండాల మండల కేంద్రంలో పోలీసులు తనిఖీ లు నిర్వహించి వాహనదారులకు జరిమానాలు వేసి కేసులను నమోదు చేశారు. మోత్కూరు ము న్సిపాలిటీ కేంద్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వ్యాపారులు షాపులను తెరిచి పది తర్వాత మూసేశారు.
సడలింపు సమయంలో సరుకుల కొనుగోలు
చౌటుప్పల్, మే30 : చౌటుప్పల్లో లాక్డౌన్ 19వ రోజు ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6 నుంచి 10 వరకు ఆదివారం సంత కొనసాగింది. దీంతో ఉదయం పది వరకు సర్వీస్ రోడ్లు జనాల తో కిటకిటలాడాయి. ప్రజలు సడలింపు సమ యంలో తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. పదిగంటల తర్వాత ప్రజలు ఇండ్లకే పరి మితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారా యి. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు.
లాక్డౌన్కు సహకరిస్తున్న వ్యాపారులు
రామన్నపేట, మే30: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10గంటల్లోపే వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో ప్రధాన, అంతర్గత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మం డలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. చెక్పోస్ట్ వద్ద పోలీసులకు లక్ష్మి మహిళాసంఘం అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మమ్మ బటర్మిల్క్ ప్యాకెట్లను అందజేశారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
యాదగిరిగుట్ట రూరల్, మే 30: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మాసాయిపేట నాల్గో వార్డు సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు బాబురావుగౌడ్ కోరారు. ఆదివారం తన వార్డు పరిధిలోని అన్ని కాలనీల్లో పంచాయతీ సిబ్బందితో శానిటైజేషన్ చేయించి, రోడ్డుకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
వాహనాల తనిఖీ
తుర్కపల్లి, మే30 : మండలంలో లాక్డౌన్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10 గంటల వరకు వర్తక, వ్యాపారాలను వ్యాపారులు తెరిచి ఉంచారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీ నిర్వహించి చలనాలు విధించారు.
నిర్మానుష్యంగా రోడ్లు
ఆత్మకూరు(ఎం), మే 30: మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం 10 గంటల్లోపు వ్యాపారులు తమ షాపులను మూసేశారు. దీంతో మండలం, అన్ని గ్రామాల్లోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ ఇద్రిస్ అలీ పోలీసు సిబ్బందితో కలిసి అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.