కోల్కతా: నారదా స్టింగ్ ఆపరేషన్ స్కామ్ కేసులో పశ్చిమ బెంగల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కేసులో దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ఆమె సవాల్ చేసిన రెండు రోజులకే మమతపై సీబీఐ కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానంలో 123 పేజీల చార్జిషీట్ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, రాష్ట్ర మంత్రి మలయ్ ఘటక్ పేర్లను చేర్చింది. ఈ కేసులో మమతా బెనర్జీ దుష్ప్రవర్తనను సీబీఐ తన చార్జిషీట్లో ఎత్తి చూపింది.
సీబీఐ ప్రత్యేక కోర్టులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. ఈ కేసు విచారణను పూర్తిగా హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా కోరనున్నారు.
అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సీబీఐ అరెస్ట్ చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవని ఓ సమావేశంలో మమతా బెనర్జీ అన్నట్లు సమాచారం. త్రుణమూల్ సీనియర్ నేత మదన్ మిత్రాతోపాటు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..