హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫ్రీడమ్ మారథాన్లో సాయి నిహార్ సత్తాచాటాడు. 3 గంటల 36 నిమిషాల్లో 15 కిలోమీటర్ల దూరం ఈది తెలుగు రాష్ర్టాల్లో ఈ ఘనత సాధించిన తొలి స్విమ్మర్గా రికార్డు సృష్టించాడు. 100 మీటర్ల ట్రాక్లో 150 ల్యాప్లు ఈదిన నిహార్ను సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జియాన్ స్విమ్మింగ్ అకాడమీలో ఏర్పాటు చేసిన ప్రీడమ్ మారథాన్ను సాట్స్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఒలింపిక్స్లో రాష్ట్రం నుంచి ఇద్దరు, ముగ్గురు స్విమ్మర్లైనా పాల్గొనాలి. అందుకు తగ్గట్లు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ముందడుగు వేయా లి. అంతర్ రాష్ట్ర, జాతీయ పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర స్విమ్మింగ్ సంఘం చొరవ తీసుకోవాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమం లో స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి రామకృష్ణ, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.