సెయింట్ లూసియా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. సోమవారం ముగిసన రెండో టెస్టులో సఫారీ జట్టు 158 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 298 పరుగులు చేయగా.. విండీస్ 174 రన్స్కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ తడబడటంతో సఫారీ జట్టు 174 పరుగులు చేసి కరేబియన్ల ముందు 324 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో కైరన్ పావెల్ (51) మినహా తక్కినవారంతా విఫలమవడంతో వెస్టిండీస్ 165 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 5 వికెట్లు పడగొట్టాడు.