ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరిన మాస్టర్ బ్లాస్టర్ గురువారం ఇంటికి చేరుకున్నాడు. తాను ఇప్పటి నుంచి హోం ఐసొలేషన్లో ఉంటానని సచిన్ ట్వీట్ చేశాడు. తన కోసం ప్రార్థించిన అందరికీ, తనకు వైద్యం అందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.