న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ 21వ శతాబ్దానికి గాను అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మన్గా నిలిచాడు. కెరీర్లో 51 టెస్టు శతకాలు చేసిన మాస్టర్బ్లాస్టర్కే తాజాగా నిర్వహించిన ఓ పోల్లో అభిమానులు పట్టం కట్టారు. స్టార్స్పోర్ట్స్ జరిపిన ఈ పోల్లో అభిమానులు, కామెంటేటర్లు పాల్గొన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర నుంచి కాస్త పోటీ ఎదురైనా చివరికి సచిన్దే పైచేయి అయింది. 16 ఏండ్ల వయసులో అరంగేట్రం చేసిన టెండూల్కర్ సుదీర్ఘ ఫార్మాట్లో మొత్తం 15,921 పరుగులు చేశాడు. అలాగే విజ్డన్ ఎంపిక చేసిన ఆల్టైమ్ టెస్టు వరల్డ్ ఎలెవెన్లో చోటు దక్కించుకున్న ఏకైక భారత ప్లేయర్గానూ సచిన్ నిలిచాడు. 100 అంతర్జాతీయ శతకాలతో శిఖరమంత రికార్డును నెలకొల్పిన మాస్టర్ 2013లో ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.