ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దవాఖానలో చేరాడు. కరోనా వైరస్కు గురైన ఆరు రోజుల తర్వాత ముందస్తు జాగ్రత్తగా చర్యగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని టెండూల్కర్ శుక్రవారం ట్వీట్ చేశాడు. ‘నా కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. డాక్టర్ల సలహా మేరకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా దవాఖానలో చేరుతున్నా. కొన్ని రోజుల్లోనే మళ్లీ ఇంటికి వెళతాననుకుంటున్నా. అందరూ జాగ్రత్తలు తీసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. మరోవైపు 2011 ప్రపంచకప్ గెలిచి శుక్రవారానికి దశాబ్దం కావడంతో ‘భారతీయులందరికీ, జట్టు సభ్యులకు శుభాకాంక్షలు’ అని సచిన్ రాసుకొచ్చాడు. కాగా కరోనా నుంచి సచిన్ త్వరగా కోలుకోవాలని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ఆకాక్షించాడు. కరోనాను టెండూల్కర్ త్వరలోనే సిక్సర్ బాదుతాడని ట్వీట్ చేశాడు.
ఇవీ కూడా చదవండి
=