ముంబై: కరోనా నుంచి కోలుకున్న భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 47ఏండ్ల సచిన్ మరికొన్ని రోజులు హోంక్వారంటైన్లో ఉంటాడు. ప్రమాదకర వైరస్ నుంచి తాను త్వరగా కోలుకోవడానికి చికిత్స చేసిన వైద్య సిబ్బందికి, కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు సచిన్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపాడు.
‘ఇంతకుముందే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాను. తాను పూర్తిగా కోలుకోవడానికి, విశ్రాంతి కోసం ఐసోలేషన్లో ఉంటాను. నేను బాగుండాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విరామం లేకుండా ఏడాదిగా పనిచేస్తున్న
వైద్య సిబ్బందికి, నన్ను ఇంత బాగా చూసుకున్న మెడికల్ స్టాప్ అందరికీ నేను కృతజ్ఞుడిని’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
తనకు కరోనా సోకిందని మార్చి 27న సచిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. రోడ్సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్లో పాల్గొన్న తర్వాత టెండూల్కర్ కరోనా పాజిటివ్గా తేలింది.