న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు వెళ్తున్న భారత అథ్లెట్లు పతకాలతో తిరిగి రావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు. సవాళ్లను స్వీకరించాలని, ఒత్తిడికి లొంగవద్దని అథ్లెట్లతో అన్నాడు. భారత్కు చెందిన 47 మంది సభ్యుల అథ్లెట్ల బృందం ఈనెల 23న టోక్యోకు వెళ్లనున్న నేపథ్యంలో.. వారితో మంగళవారం ఏర్పాటుచేసిన ఆన్లైన్ సమావేశంలో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టెండూల్కర్ మాట్లాడుతూ.. ‘ఆటలో గెలుపోటములు సహజమే అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఓటమి మీ ప్రత్యర్థిది.. గెలుపు మీది కావాలి. పతకాల కోసం పోరాడండి. దాని కోసం కలలు కనడం ఆపకండి. ఆ కల ఒలింపిక్ పతకం మీ మెడలో ఉండేది కావాలి’ అని అథ్లెట్లలో స్ఫూర్తి నింపాడు.