పటియాల: జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ సీనియర్ చాంపియన్షిప్లో తమిళనాడు యువ స్ప్రింటర్ ధనలక్ష్మి స్వర్ణంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 100మీటర్ల రేసులో ధనలక్ష్మి(11.52సె)అగ్రస్థానంలో నిలిచింది. అమశా డిసిల్వా(11.59సె), అర్చన సుస్రీందన్(11.60) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ద్యుతీచంద్(11.62సె) నాలుగో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.