ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. లాక్డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణను పునఃప్రారంభించారు. తాజా షెడ్యూల్లో నాయకానాయికలపై ఓ యుగళగీతం, కొన్ని కీలక సన్నివేశాలను తెరెకెక్కించబోతున్నారు. 1980దశకం యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తొలుత జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కరోనా సెకండ్వేవ్ ప్రభావంతో చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్తో చిత్రీకరణ మొత్తం పూర్తిచేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాతో పాటు ‘సలార్’ ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.