దేవరకద్ర రూరల్: మే 6: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలోగల మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం వరకు 13.3 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటినిల్వ పూర్తి సామర్థ్యం 32.6 అడుగులు(2.3 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 13.3 అడుగుల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. నారాయణపేట, కొడంగల్, మద్దూర్ మండలాలకు 10 క్యూసెక్కుల తాగునీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.