ఆర్సీబీ బ్యాటింగ్ సలహాదారుగా టీమ్ఇండియా మాజీ కోచ్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ కోసం ప్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 18న ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా జరగనుంది. ఐపీఎల్-2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటింగ్ కన్సల్టెంట్గా భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ను నియమించినట్లు ప్రకటించింది. ఇంతకుముందు 2014 నుంచి 2016 వరకు మూడు సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు బంగర్ కోచ్గా వ్యవహరించాడు.
2014 నుంచి 2019 ప్రపంచకప్ వరకు సంజయ్ బంగర్ టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవిలో కొనసాగాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం బ్యాటింగ్ సలహాదారుగా సంజయ్ బంగర్ను ఆర్సీబీ ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నందుకు తామెంతో సంతోషిస్తున్నామని ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది.
We are delighted to welcome Sanjay Bangar to the RCB Family as a batting consultant for #IPL2021! ????
— Royal Challengers Bangalore (@RCBTweets) February 10, 2021
Welcome aboard, Coach! ????????????????#PlayBold #WeAreChallengers #NowARoyalChallenger pic.twitter.com/SWKLthSyXl
తాజావార్తలు
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?