అబుదాబి: ఐపీఎల్ ( IPL 2021 ) చరిత్రలో ఇప్పటి వరకూ ఏ బ్యాటర్కూ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఒక టీమ్పైనే 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా అతడు నిలిచాడు. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో 33 పరుగులు చేసిన రోహిత్.. ఈ యూనిక్ రికార్డును అందుకున్నాడు. దీంతో కేకేఆర్పై రోహిత్ వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
రోహిత్ తర్వాతి స్థానంలో సన్రైజర్స్ టీమ్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అతడు పంజాబ్ కింగ్స్పై 943 పరుగులు, కోల్కతా నైట్రైడర్స్పై 915 పరుగులు చేశాడు. వార్నర్ తర్వాత విరాట్ కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్పై 909 పరుగులు, చెన్నై సూపర్కింగ్స్పై 895 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్పై 894 పరుగులు చేయడం విశేషం.