చిత్రకారుడు శంతను హజారికాతో శృతిహాసన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ విరామాన్ని ఈ ప్రేమజంట ముంబయిలో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా కపుల్ క్విజ్ పేరుతో ప్రియుడు శంతనుతో కలిసి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది శృతిహాసన్. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఇద్దరూ జంటగా సమాధానమిచ్చారు. మీరు తరచుగా కలిసి వెళ్లే రెస్టారెంట్ ఏది అని అడగ్గా…లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లడం లేదని ఇంట్లోనే భోజనం చేస్తున్నామని చెప్పింది. డైనింగ్ రూమ్కంటే సోఫాలో పక్కపక్కనే కూర్చొని తినడంలోనే ఆనందంగా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మీరిద్దరు ఎంత సమయం కలిసి గడుపుతుంటారు అనే ప్రశ్నకు 24 బై 7 అంటూ శృతిహాసన్ సమాధానమిచ్చింది. మీ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందని అడగ్గా..అది రహస్యమంటూ తెలివిగా శృతిహాసన్ చెప్పగా.. ఎలా కలుసుకున్నామో నాకు తెలియదు అంటూ ఫన్నీగా శంతను బదులిచ్చాడు. ఇద్దరిలో ఎవరు తెలివైన వారో చెప్పడం కొంచెం చాలెంజింగ్గానే ఉంటుందని.. ఓవరాల్గా చూసుకుంటే శంతను కంటే తానే స్మార్టర్గా భావిస్తున్నానని శృతిహాసన్ చెప్పింది. ప్రస్తుతం వంట బాధ్యతల్ని తానే స్వీకరించానని, బెంగాళీ స్పెషల్ ఆలూ పిటిక కర్రీ చేయడంలో శంతను ఎక్స్పర్ట్ అని శృతిహాసన్ తెలిపింది.