చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం రాత్రి ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ పోరులో రోహిత్ ఇంకో 28 పరుగులు చేస్తే, టీ20ల్లో కెప్టెన్గా 4వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా అరుదైన ఘనత సాధించనున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో హిట్మ్యాన్ ఇప్పటి వరకు 202 మ్యాచ్ల్లో 5292 పరుగులు పూర్తి చేశాడు. అత్యధిక స్కోరు 109 కాగా, 39 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఫామ్లో ఉన్న రోహిత్..సన్రైజర్స్తో మ్యాచ్లో చెలరేగాలని భావిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్రైజర్స్ సీజన్లో బోణీ చేయాలని పట్టుదలతో ఉంది.