చెన్నై: జంతువులపై మమకారాన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్శర్మ మరోమారు చాటుకున్నాడు. అంతరించిపోతున్న ఖడ్గమృగాల (రైనోలు) పరిరక్షణ కోసం హిట్మ్యాన్ ముందుకొచ్చాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్లో రోహిత్.. రైనో బొమ్మలతో కూడిన షూస్ను ధరించాడు. ఖడ్గమృగాలను కాపాడాలని సందేశమిచ్చాడు.