మెదక్ మున్సిపాలిటీ, జూలై 01: ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణ అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతి గురువారం పట్టణంలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల సమక్షంలో వార్డు సభలు నిర్వహించారు. 12వ వార్డు సభలో పాల్గొన్న చంద్రపాల్ మాట్లాడుతూ మురుగు కాల్వలను, శుభ్రపరచడం వంటి కార్యక్రమాలతో చేయాలన్నా రు. ఈ సందర్భంగా పట్టణంలోని 32 వార్డుల్లో సభలు నిర్వహించి సమస్యలను గుర్తించారు. ఈ వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈలు బలసాయగౌడ్, సిద్ధేశ్వరి, టీపీఎస్ లక్ష్మీపతి, వర్క్ఇన్స్పెక్టర్ సలీం, వార్డుల కౌన్సిలర్లతో పాటు వా ర్డు ప్రత్యేకాధికారులు, జిల్లా మెప్మా అధికారి ఇందిర, సునిత పాల్గొన్నారు
పాపన్నపేటలో..
పాపన్నపేట, జూలై 1: మండల పరిధిలోని వివిధ గ్రా మాల్లో ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్పంచ్లు గ్రామ కార్యదర్శుల సమక్షంలో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగింది.26 పంచాయతీల్లో పల్లెప్రగతిలోప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఎంపీడీవో ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పం చ్ ప్రభాకర్రెడ్డి, మల్లంపేట సర్పంచ్ బాపురెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు
పాతూరులో…
మెదక్ రూరల్ జూలై1: గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఈత వనాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రజాక్ అన్నారు.మెదక్ మండలంలోని పాతూరులో హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ లింగమ్మ ,ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబీషన్ ఎక్సైజ్ శాఖ అధికారి రజాక్ , ఎక్సైజ్ సీఐ గోపాల్ . టీఆర్ఎస్ నాయకులు బాలయ్య , ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు 500 ఈత మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో ఎక్సై జ్ ఎస్సై రహ్మద్ పాషా, రవి, ప్రశాంత్ , టీఆర్ఎస్ నా యకులు బాలయ్య, శ్రీనివాస్, బీట్ అధికారి లక్ష్మణ్ ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.
పల్లెలో పరిశుభ్రత పెంచాలి
గ్రామాల్లో పరిశుభ్రత పెంచాలనే లక్ష్యంగా పల్లెప్రగతి చేపట్టారని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. పాతూరు లో ఎంపీడీవో శ్రీరాములు సర్పంచ్ లింగమ్మ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. కార్యకమంలో ఎంపీవో ,టీఆర్ఎస్ నాయకులు బాల య్య, శ్రీనివాస్, వార్డు సభ్యులుఅధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి:ఎంపీపీ నారాయణరెడ్డి
హవేళిఘనపూర్, జూలై 1: ప్రజలు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కూచన్పల్లి సర్పంచ్ దేవాగౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించా రు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలు గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్నారు. కూచన్పల్లిని ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ బయ్యన్న, పంచాయతీ సెక్రటరీ లిఖిత, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజ లు పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
మెదక్ ,జూలై 1: హరిత హారంలో ప్రతి ఒక్కరూ భా గస్వామ్యం కావాలని ఇన్చార్జి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.జిల్లా రవాణా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంవీఐ క్రిస్టాఫర్ , ఏవో రజని ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లెప్రగతి గ్రామసభలు
చిన్నశంకరంపేట,జూలై1: మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభలను నిర్వహించారు. సభలో గ్రామ సమస్యలు చర్చిం చారు. కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, స్పెష ల్ ఆఫీసర్ వెంకటయ్య,ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీ వో గిరిధర్రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.
పల్లె ప్రగతిపై గ్రామాల్లో గ్రామసభలు
పెద్దశంకరంపేట, జూలై 1: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్దశంకరంపేటతో పాటు మండలంలోని గ్రామాల్ల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో తెలుసుకోవడంతో పాటు గ్రామస్తుల తో చర్చించారు.కార్యక్రమంలో ఎంపీడీవో విఠల్, ఏ పీవో రియాజొద్దిన్, ఈవో విఠల్, సర్పంచ్ల ఫోరం మం డల అధ్యక్షుడు రాములు, సర్పంచ్ సత్యనారాయణ, తదితరులున్నారు.