జైపూర్ : రిఫ్రిజిరేటర్ సరిగా పని చేయకపోవడం వల్ల సుమారు 480 డోసుల కోవీషీల్డ్ టీకాలు పాడైపోయాయి. ఈ సంఘటన రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలో ఉన్న రఘునాథపుర గ్రామంలోని పీహెచ్సీలో ఈ ఘటన మే 22వ తేదీన జరిగింది. వ్యాక్సిన్లు నిల్వ చేసే రిఫ్రిజిరేటర్ ఆగిపోయిందని, దీంతో దాంట్లో ఉన్న టీకా డోసులన్నీ గడ్డకట్టుకుపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై దుంగార్పుర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మహేంద్ర పర్మార్ విచారణ చేపట్టారు. ప్రత్యేక వైద్య బృందం ఆ హాస్పిటల్ను విజిట్ చేసి డాక్టర్లను, స్టాఫ్ను విచారించారు.