అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది ఏడో హాఫ్ సెంచరీ. వాషింగ్టన్ సుందర్తో కలిసి టీమ్ను ఆదుకున్న అతడు.. ఇప్పుడు ఆధిక్యం అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక దశలో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమ్ను నెమ్మదిగా ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు (205) వైపు లాక్కెళ్తున్నాడు. అతనికి సుందర్ మంచి సహకారం అందిస్తున్నాడు. మరీ మూడో టెస్ట్ అంత కాకపోయినా.. అహ్మదాబాద్ పిచ్ ఇప్పటికీ బౌలర్లకే సహకరిస్తోంది. దీంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇండియన్ టీమ్ మంచి ఆధిక్యం సాధిస్తే మ్యాచ్పై పట్టు దొరుకుతుంది.