మాస్కో : సోమాలియా రాజధాని మొఘడిషులోని ఓ పోలీసు స్టేషన్పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ పేలుడులో మరణించిన కుటుంబాలకు సోమాలియా ప్రధానమంత్రి ముహమ్మద్ హెచ్ రోబ్లే తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ పేలుడు ఘటనను ప్రధాని ఖండించారు. ఈ పేలుడులో వాబేరి పోలీసు చీఫ్ అహ్మద్ బాషానే, డిప్యూటీ కమాండర్ అబ్దీ బాసిద్ లతో కలిసి ఆరుగురు మరణించారు.