హైదరాబాద్, ఆట ప్రతినిధి: రెడ్బుల్ నెయ్మర్ జూనియర్ 2021 ఫుట్బాల్ టోర్నీలో గోవా సిటీ జాతీయ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో గోవాకు చెందిన కళింగ రేంజర్స్ 2-0 తేడాతో సన్నీ బాయ్స్(పుణె)పై విజయం సాధించింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన రేంజర్స్.. ప్రత్యర్థిపై విజయంతో టైటిల్ను దక్కించుకుంది. విజేతగా నిలిచిన కళింగ రేంజర్స్ భారత్ తరఫున ఖతార్లో జరిగే ప్రపంచ ఫైనల్ టోర్నీలో బరిలోకి దిగనుంది. అంతకుముందు జరిగిన వేర్వేరు సెమీఫైనల్ మ్యాచ్ల్లో కళింగ రేంజర్స్ 1-0తో బ్లాక్ అండ్ వైట్(కొచ్చి)పై, సన్నీ బాయ్స్ 1-0తో జాక్ ఎఫ్సీ(ఢిల్లీ)పై విజయాలు సాధించాయి.