భువనగిరి కలెక్టరేట్, మే2: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులకు సూచించా రు. జిల్లాలో కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, బీబీనగర్ ఎయిమ్స్ డాక్టర్లతో కలిసి ఆమె ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఆక్సిజన్, పడకల లభ్యత విషయంలో ఎలాంటి లోపం జరగొద్దన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో కొవిడ్ కం ట్రోల్ సెంటర్లో తక్షణమే 20 ఆక్సిజన్ బెడ్స్తో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా భువనగిరి ఏరియా దవాఖానలో 25 పడకలకు ఆక్సిజన్ సిలిండర్లు నింపించి, తక్షణమే అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని, కొవిడ్ బారినపడిన వారి కి తక్షణ వైద్యసాయం అందించేందుకు యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉన్నతాధికారులను నోడల్ అధికారులుగా నియమించి కొవిడ్ తీవ్రతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని సూచించారు. ఎయిమ్స్కు నోడల్ అధికారిగా జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, భువనగిరి ఏరియా దవాఖానకు డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, చౌటుప్పల్ సివిల్ దవాఖానకు స్థానిక ఆర్డీ, రామన్నపేట ఏరియా దవాఖానకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని నోడల్ అధికారులుగా కలెక్టర్ నియమించారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డు సిబ్బందికి పరీక్షలు
చౌటుప్పల్, మే2: మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీలు, సిబ్బందికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో ఆదివారం వైద్యసిబ్బంది కొవిడ్ పరీక్షలు చేశారు. 30 మందికి పరీక్షలు చేయగా ఒక్కరికి పాజిటివ్గా తేలిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, గోవర్ధన్రెడ్డి, పరమేశ్, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బీబీనగర్, మే 2 : ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీబీనగర్ మండల జడ్పీటీసీ ప్రణీతాపింగళ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె కొవిడ్ సమయంలో వైద్య సేవలందిస్తున్న పీహెచ్సీ వైద్యులు, నర్సులు, ఆశవర్కర్లకు కోడిగుడ్లను పం పిణీ చేశారు. కార్యక్రమంలో అక్బర్, సంతోష్రెడ్డి, మస్తా న్, విజయ్, రమేశ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కొండంపేటలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
అడ్డగూడూరు, మే 2: కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని కొండంపేట గ్రా మంలో సర్పంచ్ కుమార్స్వామి ఊరిలోని వీధుల్లో ఆదివారం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మా స్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.