కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం,
విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల వల్ల ల్యాప్టాప్లకు గిరాకీ పెరిగింది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ(Realme) ఈ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
త్వరలో భారత్లో రియల్మీ తన మొట్టమొదటి ల్యాప్టాప్( laptop)ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
2021 మూడో త్రైమాసికంలో ఈ ల్యాప్టాప్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. రియల్మీ రూ .30,000 నుంచి రూ .50 వేల మధ్య ల్యాప్టాప్ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. షియోమీ ఎంఐ నోట్బుక్ 14(రూ . 41,999)కు రియల్మీ ల్యాప్టాప్ గట్టిపోటీనివ్వనున్నంది. విద్యార్థుల కోసం డిజైన్ చేసిన నోట్బుక్కు మంచి ఆదరణ లభిస్తున్నది. హానర్ మ్యాజిక్ బుక్ 15 పేరుతో గతేడాది తన తొలి ల్యాపటాప్ను భారత దేశంలో లాంచ్ చేసింది.