ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
హైరిస్క్ గ్రూప్ వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం
చొప్పదండి, జూన్ 5: అర్హులంతా వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి జడ్పీ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ పరిధిలోని హైరిస్క్ గ్రూపు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేయడానికే హైరిస్క్ గ్రూపు వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, తాళ్లపెల్లి శ్రీనివాస్, పెరుమాండ్ల గంగయ్య, మహేశుని మల్లేశం, వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఒద్యారం సందర్శన
గంగాధర, జూన్ 5: ప్రజల సహకారంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఒద్యారం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో శనివారం ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించారు. పాజిటివ్ కేసులు పెరుగడానికి కారణాలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కొవిడ్ బాధితులు హోం ఐసొలేషన్లో ఉండాలని, పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని భరోసా కల్పించారు. కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బాలసంకుల అనంతరావు, ఆయన మిత్ర బృందాన్ని అభినందించారు. ఇక్కడ సర్పంచ్ ములుకుంట్ల సంపత్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సలువాజి విద్యాసాగర్రావు, నాయకులు సలువాజి రామారావు, కవ్వంపెల్లి కొమురయ్య, సలువాజి ఇందిరాకుమారి, ములుకుంట్ల వెంకటస్వామి, సంజీవరావు, శ్రీకాంత్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.