టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండగా..కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడన్న వార్త చాలా ఇంట్రెస్టింగ్ గా మాంది.
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానతో ఎన్టీఆర్ డిస్కషన్స్ చేస్తున్నాడని, మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించబోతుందని టాక్ వినిపిస్తోంది.బుచ్చిబాబు వినిపించిన కథ ఎన్టీఆర్ కు చాలా నచ్చిందట. అయితే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అవుతాడని తెలుస్తోంది.
ఉప్పెన సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు ఫీల్ గుడ్ సినిమాను అందించాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబుకు ఉప్పెన తర్వాత ఆఫర్లు క్యూ కడుతున్నాయట. మరి బుచ్చిబాబు తన సినిమాలో తారక్ ను ఎలా చూపిస్తాడన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!