ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటింది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 10,187 కరోనా కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,586కు, మరణాల సంఖ్య 52,440కు చేరింది.
మరోవైపు గత 24 గంటల్లో 6,080 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,62,031కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,897 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.