నంబర్వన్ టెస్టు ర్యాంకుపై రవిశాస్త్రి
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టుగా ఉండేందుకు టీమ్ఇండియాకు పూర్తి అర్హత ఉందని జట్టు హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. క్లిష్ట సమయాల్లో తమ ఆటగాళ్లు అకుంఠిత దీక్ష, పట్టుదల ప్రదర్శించి సత్తాచాటారని ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశాడు. ఐసీసీ టెస్టు ర్యాంకుల వార్షిక అప్డేట్ తర్వాత భారత్ టాప్ర్యాంకును కొనసాగించగా.. శాస్త్రి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచ నంబర్వన్ స్థానంలో ఉండేందుకు జట్టు అపార కృషి, ఎంతో ఏకాగ్రత కనబరిచింది. ఇందుకు మా కుర్రాళ్లు పూర్తి అర్హులు. మధ్యలో నిబంధనలు మార్చినా అన్ని అడ్డంకులను టీమ్ఇండియా దాటింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మా కుర్రాళ్లు సత్తాచాటారు. నాకు చాలా గర్వంగా ఉంది అని శాస్త్రి ట్వీట్ చేశాడు. కాగా జూన్ 18 నుంచి 22 మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.