టోక్యో: ఒలింపిక్స్ రెజ్లింగ్లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా ( Ravi Dahiya ) సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన రెజ్లర్ జవుర్ ఉగుయెవ్ చేతిలో రవి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్లో సిల్వర్ గెలిచిన రెండో ఇండియన్ రెజ్లర్గా అతడు నిలిచాడు. గతంలో 2012 ఒలింపిక్స్లో సుశీల్కుమార్ రెజ్లింగ్లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన రవి దహియా ఏకంగా ఫైనల్ చేరి ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకు ఇది ఐదో మెడల్ కావడం విశేషం. వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను సిల్వర్ గెలవగా.. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సింగ్లో లవ్లీనా బోర్గొహైన్, హాకీలో మెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే.
రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన జవుర్ ఉగుయెవ్ 57 కిలోల కేటగిరీలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్. గతేడాది డిసెంబర్లో బెల్గ్రేడ్లో జరిగిన వరల్డ్కప్లో గెలిచాడు. తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగాడు. గత 15 టోర్నమెంట్లలో అతడు 14 మెడల్స్ గెలిచాడు. అందులో 12 గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. 2020 వరల్డ్కప్లో ప్రత్యర్థులపై 45-1 స్కోరుతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. రవి దహియా ఇతనితో 2019 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో ఆడి ఓడిపోయాడు. దహియాపై 6-4తో గెలిచాడు. ఆ టోర్నీలో రవి బ్రాంజ్ మెడల్ గెలిచాడు.