టోక్యో : భారత రెజర్లకు ఇవాళ టోక్యోలో మిశ్రమ ఫలితలు వచ్చాయి. రెజ్లర్ రవికుమార్ దహియా ( Ravi Kumar Dahiya ).. 57 కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ ( Wrestling ) క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఇవాళ జరిగిన మ్యాచ్లో కొలంబియా రెజ్లర్ ఆస్కార్ టిగ్రిరోస్పై విజయం సాధించాడు. 23 ఏళ్ల రవికుమార్ తొలిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగాడు. ప్రతి రౌండ్లోనూ రవికుమార్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌట్ను 13-2 స్కోర్ తేడాతో దహియా మ్యాచ్ను గెలిచాడు. 57 కేజీల పురుషుల రెజ్లింగ్లో రవికుమార్.. ఆసియా చాంపియన్. వరల్డ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన దహియా.. కొలంబియా రెజ్లర్ను వత్తిడిలో పెట్టాడు. సెకండ్ పీరియడ్లో టెక్నికల్ సుపీరియార్టీతో మ్యాచ్ను 13-2 తేడాతో కైవసం చేసుకున్నాడు. క్వార్టర్స్లో బల్గేరియా ప్లేయర్ జార్జి వంగెలేవ్తో రవికుమార్ పోటీపడనున్నారు.
57 కేజీల మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో అన్షూ మాలిక్ క్వార్టర్స్లో ఓటమిపాలైంది. బెలారస్కు చెందిన ఇర్నా కురాచికినా చేతిలో ఆమె పరాజయాన్ని చవిచూసింది.