జైపూర్: ఇకపై పుట్టిన రోజు వంటి ఫంక్షన్లు మెట్రో రైల్ కోచుల్లో జరుపుకోవచ్చు. ఇలాంటి వేడుకల కోసం వీటిని అద్దెకు తీసుకోవచ్చని రాజస్థాన్లోని జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఒక కోచ్కు నాలుగు గంటలకు రూ.5,000 ప్రతి అదనపు గంటకు రూ.1,000 చార్జ్ అవుతుందని తెలిపింది. నాలుగు కోచ్లకు నాలుగు గంటలకు రూ.20,000, ప్రతి అదనపు గంటకు రూ.5,000 చార్జ్ వసూలు చేస్తామని చెప్పింది.
అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో కలిసి స్వల్ప కాల ప్రకటనలు, బ్యానర్లు, ప్రకటనల స్టాండ్లను సంబంధింత చార్జీలతో మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తామని జైపూర్ మెట్రో రైల్ తెలిపింది. అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.