ముంబై : మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 నుంచి 50 మంది ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.