న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం ఉత్తరాఖండ్తో జరిగిన ప్రిక్వార్టర్స్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ఉత్తరాఖండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. కమల్ (77), కునాల్ చండేలా (62) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో అనూజ్ (95 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), నితీశ్ రాణా (81), ప్రదీప్ సాంగ్వాన్ (58) దుమ్మురేపడంతో ఢిల్లీ 48.3 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసి గెలుపొందింది.