హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో.. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లేయర్లకు అంకుర గణపతులు అందించారు. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి 1001 అంకుర గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశాం. క్రీడాకారులకు, కోచ్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ సీడ్ గణపతులు అందించారు. పర్యవరణ పరిరక్షణకు ఇవి ఎంతో తోడ్పడుతాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.