ముంబై: ఎవరికైనా కరోనా సోకిందంటే జనం అటువైపు వెళ్లేందుకే జంకుతున్నారు. ఇక కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులను పరామర్శించడానికి కూడా ఎవరూ సాహసించడంలేదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీక్కుతిన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ శ్మశానవాటికలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపాలిటీ పరిధిలోగల ఓ శ్మశానవాటికలో కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ సగం కాలిన ఓ మృతదేహాన్ని ఓ వ్యక్తి పీక్కు తింటున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఫల్టాన్ మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు అక్కడికి చేరుకునేలోపే సదరు వ్యక్తి జారుకున్నాడు.
కానీ, అధికారులు పట్టణం అంతటా గాలించి సాయంత్రానికి అతడిని పట్టుకోగలిగారు. అయితే సదరు వ్యక్తి ప్రవర్తనను బట్టి అతనికి మతిస్థిమితం సరిగా లేదనిపిస్తోందని అధికారులు గుర్తించారు. అతడిని మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించామని,మెడికల్ రిపోర్టులు వచ్చిన అనంతరం ఘటనకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పనస పండ్ల కింద కోటి రూపాయల గంజాయి..!
పెండ్లి నాడే ఎన్నికల్లో గెలుపు.. లక్కీ పెండ్లి కూతురు..!
సిక్కు యువకుడిపై సుత్తితో దాడి.. ఆమెరికాలో దారుణం..!
ఆటోవాలాలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం
ముగిసిన ఎన్నికలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది దుర్మరణం
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రకటించిన స్టాలిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి