హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి మరో 51 మంది మరణించారు. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా.. 6,361 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు. మరో 2,527 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,225, మేడ్చల్ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.