న్యూఢిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్తో పోరాడుతున్న భారత్కు అండగా నిలిచేందుకు క్రీడాలోకం ముందుకొస్తున్నది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు ఆర్థిక సహాయమివ్వగా, తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గురువారం రూ7.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. ఢిల్లీలో అత్యవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్స్ సమకూర్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 1.5 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.