పరిగి, మార్చి 30: పరిగి మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.27.37 కోట్లకు ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్లో ఆస్తి పన్ను రూపంలో రూ. 2.42కోట్లు, నాన్ టాక్స్లో దుకాణాల అద్దె, కుళాయి చార్జీలు, రూ.3.64కోట్లు, డిపా జిట్లు రూ.50లక్షలు, గ్రాంట్లు రూ.20.81కోట్లుగా అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్ కు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచిం చారు. పట్టణంలో ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. ఆహ్లాదాన్ని అందించే స్థలాలుగా పార్కులను మార్చాలని, పర్యా టకులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయించాలన్నారు. జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ పట్టణం పరిధిలోఎస్ఎస్టీపీ ఏర్పాటుకు స్థలం చూడాల్సిందిగా ఆదేశిం చారు. ఎస్ఎస్టీపీ ఏర్పాటుకు ఎకరం స్థలం అవసరమని, రూ.35లక్షలు అంచనా వ్య యంతో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. డంపింగ్యార్డు నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.