నాటింగ్హామ్: ఇంగ్లండ్లో తొలి టెస్ట్లోనే చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా( India vs England )కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. నాటింగ్హామ్లో వర్షం కారణంగా చివరి రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ అక్కడ వర్షం కురుస్తోంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఇంకా విజయానికి 157 పరుగులు అవసరం కాగా.. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ (12), చెటేశ్వర్ పుజారా (12) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 183 పరుగులకే కుప్పకూలగా.. ఇండియా 278 పరుగులు చేసి 95 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆ టీమ్కు 208 పరుగుల ఆధిక్యం వచ్చింది.