క్వాలిఫయర్ టోర్నీ సెమీస్కు చేరిన సుమిత్ మాలిక్
సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. గురువారం ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీ 125 కేజీల విభాగం తొలి రౌండ్లో లాజరేవ్ (కిర్గిస్థాన్)ను చిత్తుచేసిన మాలిక్.. ప్రిక్వార్టర్స్లో అలెగ్జాండర్ రొమనోవ్ను 3-2తో మట్టికరిపించాడు. క్వార్టర్స్లో4-2తో రుస్తం ఇస్కందారి (తజకిస్థాన్)ను అలవోకగా ఓడించిన సుమిత్.. సెమీస్కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో వెనుజులాకు చెందిన జోస్ డానియల్ రాబెర్టితో సుమిత్ తలపడనున్నాడు. ఈ బౌట్లో అమిత్ విజయం సాధిస్తే.. ఈ విభాగం నుంచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించనున్నాడు. ఈ టోర్నీలో ఇతర విభాగాల్లో పోటీ పడిన భారత రెజ్లర్లు అమిత్ ధన్కర్, సత్యవర్త్ కడియాన్ ఓటమి పాలయ్యారు.