ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రనౌటయ్యాడు. జడేజా అద్భుతమైన ఫీల్డింగ్తో రాహుల్ను రనౌట్ చేశాడు. దీంతో పంజాబ్ టీమ్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే యూనివర్స్ బాస్ గేల్ (10)ను కూడా ఓ అద్భుతమైన క్యాచ్తో జడేజా ఔట్ చేశాడు. దీంతో పంజాబ్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక అదే ఓవర్లో నికొలస్ పూరన్ (0) కూడా ఔటయ్యాడు. 19 పరుగుల దగ్గరే పంజాబ్ 4 వికెట్ కోల్పోయింది.