ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా వేసుకోబోయే జెర్సీని రివీల్ చేశాడు బ్యాట్స్మన్ చెటేశ్వర్ పుజారా. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాను కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. కొత్త కిట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని ఉంది అంటూ పుజారా కామెంట్ చేశాడు. అంతకుముందు ఆదివారం ఉదయం రవీంద్ర జడేజా కూడా ఈ కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు.
న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్తోపాటు ఇంగ్లండ్ టూర్ కోసం ఇప్పటికే ఇండియన్ టీమ్ హోటల్ క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్లో అడుగుపెట్టిన తర్వాత కూడా మరోసారి క్వారంటైన్లో ప్లేయర్స్ ఉండనున్నారు. ఇక ఇప్పటికే ఇండియాలో తొలి డోసు తీసుకున్న ప్లేయర్స్కు రెండో డోసును ఇంగ్లండ్లో ఇచ్చే ఏర్పాట్లు కూడా బీసీసీఐ చేస్తోంది. వచ్చే నెల 18 నుంచి సౌథాంప్టన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్ ఇంగ్లండ్ చేరుకుంది. ఈ ఫైనల్ కంటే ముందు ఆ టీమ్తో రెండు టెస్టులు ఆడనుంది.