దిలీప్ వెంగ్సర్కార్
ముంబై: మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ ప్లేయర్లకు కూడా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(ఈ నెల 18నుంచి)లో ఇబ్బందిగా మారనుందని భారత దిగ్గజం దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో పోలిస్తే జట్టు పరంగా భారత్ పటిష్టంగా ఉందని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముందు టీమ్ఇండియా ఓ రెండు టెస్టులైనా ఆడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్మెన్. భారత్కు ఎన్నో మ్యా చ్లు గెలిపించారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వారికి కూడా ఇబ్బందిగా మారుతుందని అనుకుంటున్నా. న్యూజిలాండ్ కన్నా భారత జట్టే మెరుగ్గా ఉంది. అయితే భారీ అంచనాలు లేకపోవడం, ఇప్పటికే ఇంగ్లండ్తో ఆడుతుండడం కివీస్కు అనుకూలంగా మారవచ్చు’ అని వెంగ్సర్కార్ అన్నాడు.