ముంబై: ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-8 కోసం పలు ఫ్రాంచైజీలు 59 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. పీకేఎల్ వేలానికి ముందు తాము తిరిగి తీసుకున్న ఆటగాళ్ల జాబితాను ఆయా జట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 12 జట్లు.. 59 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు. ఎలైట్ రిటైన్డ్ ప్లేయర్స్ (ఈఆర్పీ) కేటగిరీ కింద 22 మంది, రిటైన్డ్ యంగ్ ప్లేయర్స్ (ఆర్వైపీ) కింద ఆరుగురు, న్యూ యంగ్ ప్లేయర్స్ (ఎన్వైపీ) కేటగిరిలో 31 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు నిలుపుకున్నట్టు లీగ్ నిర్వాహకులు చెప్పారు. నాన్ రిటైన్డ్ ప్లేయర్స్ కోసం ఈ నెల 29-31 మధ్య పీకేఎల్-8వ సీజన్ కోసం వేలం జరుగనున్నది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ తమ కెప్టెన్ మణిందర్ సింగ్తో పాటు గత సీజన్లో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇస్మాయిల్ నబిని తమతోనే ఉంచుకుంది.