ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కరోనా కలకలం రేపుతోంది. కోల్కతా నైట్రైడర్స్ టీమ్లో ఇద్దరు ఆటగాళ్లకు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో ఐదుగురు గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. వీరందరినీ ఐసోలేషన్లో ఉంచారు.
ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని కోల్కతా టీమ్ అహ్మదాబాద్లో ఉండగా..మహేంద్ర సింగ్
కెప్టెన్సీలోని చెన్నై జట్టు ఢిల్లీలో ఉంది. ఢిల్లీ, అహ్మదాబాద్లలో ఏర్పాటు చేసిన రెండు
బయో బబుల్లోకి మహమ్మారి ప్రవేశించడంతో ఇతర ఆటగాళ్లు కూడా వైరస్ బారిన పడే ప్రమాదముందని ఫ్రాంచైలు ఆందోళన చెందుతున్నాయి.