టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా
కరోనా వాక్సిన్ తొలి డోసును సోమవారం వేసుకున్నాడు. ఇప్పటికే చాలా మంది భారత క్రికెటర్లు కొవిడ్ టీకా మొదటి డోసును తీసుకున్నారు. న్యూజిలాండ్తో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లకు పృథ్వీకి భారత జట్టులో చోటు దక్కలేదు.
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉన్న షా ఐపీఎల్ రెండో దశలో మునుపటి ఫామ్ను కొనసాగించాలని భావిస్తున్నాడు. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్లో షా పరుగుల వరద పారించాడు.