అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వీరవిహారం చేస్తున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన షా తర్వాతి ఓవర్లలోనూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షా దంచికొట్టడంతో పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 67/0తో పటిష్ఠస్థితిలో నిలిచింది. ఐపీఎల్ 2021 సీజన్లో పవర్ప్లేలో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. మరో ఎండ్లో శిఖర్ ధావన్..పృథ్వీకి సహకారం అందిస్తున్నాడు.
ఈ క్రమంలోనే షా 18 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్ సాయంతో 50 మార్క్ సాధించాడు. 8 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. షా(54), ధావన్(25) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి ఇంకా 72 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది.