దుబాయ్: ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్(ICC Rankings)లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్(115 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఐతే వన్డే ర్యాంకింగ్స్లో మాత్రం టీమ్ఇండియా(team India) మూడో ర్యాంకుకు పడిపోయింది. వన్డేల్లో 121 రేటింగ్ పాయింట్లతో విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో ర్యాంకులో కొనసాగుతోంది.
టీ20ల్లో 277 పాయింట్లతో ఇంగ్లాండ్ టాప్లో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టిన కివీస్ మొదటి స్థానాన్ని అధిరోహించింది. 272 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో
కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య కేవలం ఐదు పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్వన్ వన్డే టీమ్గా నిలిచిన న్యూజిలాండ్కు ఐసీసీ శుభాకాంక్షలు తెలిపింది.