దేవరుప్పుల, జూలై 4 : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక భ్రమరాంబమల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి పేరిట అభిషేకం చేయించారు. కడవెండిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భం గా ఉపాధిహామీ కూలీలు కేక్ కట్ చేసి ఎర్రబెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వాసవీమాత దేవాలయంలో జీపీ కోఆప్షన్ సభ్యుడు బుక్క రామయ్య దంపతులు మంత్రి పేర చండీయాగం చేయించారు. పీహెచ్సీలో జరిగిన కార్యక్రమంలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పని చేస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్ట్ బుక్క రామయ్య దాతగా నిలువగా జన్మదిన కానుకగా వారికి మెమొంటోలు అందించారు. అనంతరం అన్నదానం చేశారు. మండల కార్యాలయాల సముదాయంలో జడ్పీటీసీ పల్లా భార్గవిరెడ్డి నేతృత్వంలో మొక్కలు నాటారు. సీతారాపురంలోని ప్రేమసదనం అనాథ వృద్ధశరణాలయంలో టీఆర్ఎస్ నేతృత్వంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, పల్లా సుందరరాంరెడ్డి, బోయినిపల్లి మనోహర్రావు, ఈదునూరి నర్సింహారెడ్డి, సర్పంచ్లు ఈదునూరి రమాదేవి, బిళ్ల అంజమ్మ, రెడ్డిరాజుల రమేశ్, కారుపోతుల భిక్షపతి, చింత రవి, కోతి ప్రవీణ్, కృష్ణమూర్తి, కొత్త జలేందర్రెడ్డి, నల్ల ఉమేవ్, పానుగంటి గిరి, బస్వ వెంకన్న, దశరథ, కిష్ట య్య, వెంకటేశ్వర్లు, యా దగిరి, చిలుపురం సోమ య్య, బొందుగుల సోమ య్య, తోటకూరి రాంచందర్, బుక్క సతీశ్, శ్రీధర్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన టీఆర్ఎస్ నాయకులు
టీఆర్ఎస్ మండల నాయకులు మంత్రి ఎర్రబెల్లిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చంతో పాటు మొక్కను, జ్ఞాపికను అందించారు. టీఆర్ఎస్ మండల ఇన్చార్జి మనోహర్రావు, మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, కారుపోతుల భిక్షపతి, కోతి ప్రవీణ్, చింత రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.